NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

TDP Vs YCP: టీడీపీపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేత అప్పిరెడ్డి..! మేటర్ ఏమిటంటే..?

TDP Vs YCP: చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ లో అక్రమాలు జరుగుతున్నాయంటూ టీడీపీ, వైసీపీ విమర్శించుకుంటున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో కుప్పం మున్సిపాలిటినీ ఇరు పార్టీలు ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. ఎలాగైనా కుప్పంలో వైసీపీని ఓడించి చంద్రబాబుకు గట్టి షాక్ ఇవ్వాలని వైసీపీ పట్టుదలతో ఉంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో వ్యూహాత్మకంగా వైసీపీ వ్యవహరిస్తోంది. టీడీపీ సైతం ఎలాగైనా గెలుచుకుని పరువు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. సోమవారం పోలింగ్ సందర్భంగా కుప్పంలో పలు వార్డుల్లో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వివాదాలు చోటుచేసుకున్నాయి. వైసీపీ దొంగ ఓట్లు వేయిస్తుందంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. పోలీసులు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ ఏజంట్ లను అరెస్టు చేసి వేరే ప్రాంతాలకు తరలించారని చంద్రబాబు సైతం ఆరోపించారు. ఈ తరుణంలో టీడీపీపై ఎస్ఈసీకి వైసీపీ నేత ఫిర్యాదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందంటూ ఎస్ఈసీ నీలం సాహ్నికి వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నారాయణమూర్తిలు ఫిర్యాదు చేశారు.

TDP Vs YCP: kuppam election
TDP Vs YCP kuppam election

 

Read More: Chandra Babu: జగన్ సర్కార్‌పై ఇన్ని కుట్రలా అంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..!!

TDP Vs YCP: ఓటమి భయంతోనే ప్రలోభాలు

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్, జడ్‌పీ ఉప ఎన్నికల్లో టీడీపీ కుట్రలకు తెరలేపిందని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ విలువలు దిగజారుస్తున్నారని విమర్శించారు. కుప్పంలో టీడీపీ నేతలు అమరనాథ్ రెడ్డి, పులివర్తి నాని దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపించారు.  కుప్పం పర్యటనలో నారా లోకేష్ న్యాయస్థానాల విలువలను దిగజార్చే విధంగా వ్యాఖ్యానాలు చేశారన్నారు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు ఓటర్లను భయపెడుతూ ప్రలోభాలకు గురి చేస్తున్నారని అన్నారు.

 

కుప్పంలో ఓటు లేని చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్ లో ఎందుకు వెళుతున్నారని అప్పిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు కుప్పంలో ఓటరే కాదనీ, నారా వారి పల్లెలోనూ ఆయనకు ఓటు లేదని అన్నారు. దొంగ ఓట్లు వేయించే సంస్కృతి టీడీపీదేననీ అన్నారు. ప్రశాంతంగా ఉన్న ఏరియాల్లో అలజడి సృష్టించాలని టీడీపీ కుట్రలు చేస్తోందని అప్పిరెడ్డి విమర్శించారు. పలు ఆధారాలతో టీడీపీ అక్రమాలపై ఎస్ఈసికి ఫిర్యాదు చేసినట్లు ఆయన వివరించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju