Telangana Employees Thanks To AP CM : సుదీర్ఘ కాలంగా ఉన్న తెలంగాణ ఉద్యోగుల సమస్యలను ఏపి సీఎం వై ఎస్ జగన్మోహన రెడ్డి పరిష్కరించారు. దీంతో తమ సమస్య పరిష్కరించినందుకు తెలంగాణ ఉద్యోగులు సీ ఎం వైఎస్ జగన్మోహన రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఏ పి సచివాలయం వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు సంబరాలు చేసుకున్నారు.
విషయంలోకి వెళితే.. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు చెందిన ఉద్యోగులు కొందరిని ఏపికి కేటాయించారు. వీరి కుటుంబాలు తెలంగాణలో ఉండిపోగా వీరు ఏడేళ్లుగా ఏపిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తమ రాష్ట్రానికి పంపించాలంటూ చాలా కాలంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సమస్యపై గతంలో తెలంగాణ సీ ఎం కేసిఆర్ తో ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తెలంగాణ చర్చించారు. దీనిపై సీ ఎం కేసిఆర్ సానుకూలంగా స్పందించారు. దీంతో ఇటీవల ఆ ఉద్యోగులను తెలంగాణలో తీసుకునేందుకు గానూ అక్కడి సర్కార్ సంబందిత ఫైల్ ను ఏపికి పంపింది. ఈ విషయాన్ని ఏపిలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులు సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై వెంటనే స్పందించిన జగన్ ఉద్యోగుల బదిలీ ఫైల్ ను క్లీయర్ చేసి వారిని తెలంగాణ రాష్ట్రానికి పంపాలని అధికారులను ఆదేశించారు. జగన్ ఆదేశాలతో తెలంగాణకు చెందిన క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులను రిలీవ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏడేళ్ల తరువాత పర్మినెంట్ గా సొంత రాష్ట్రానికి వెళుతున్న 711 మంది ఉద్యోగులు బుధవారం కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. తమను రిలీవ్ చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారికి సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు వెలగపూడి సచివాలయం వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.