AP greenko project: ఏపిలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు పరిధిలోని పిన్నాపురం వద్ద గ్రీన్కో సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే ఈ ప్రాజెక్టు పై తెలంగాణ సర్కార్ అభ్యంతరం తెలిపింది. ఈ ప్రాజెక్టుపై కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి ఫిర్యాదు చేసింది తెలంగాణ సర్కార్. ఈ మేరకు తెలంగాణ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) మురళీధర్ మంగళవారం కేఆర్ఎంబీ చైర్మన్ కు లేఖ రాశారు. ఈ లేఖలో మురళీధర్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
AP greenko project: అనుమతులు లేని ఈ ప్రాజెక్టులను నిలువరించాలి
ఎలాంటి అనుమతులు లేకుండానే ఏపి ప్రభుత్వం పంప్డ్ హైడ్రో ప్రాజెక్టును చేపడుతోందని ఆయన ఆరోపించారు. అనుమతులు లేని ఈ ప్రాజెక్టులను నిలువరించాలని ఆయన కోరారు. ఏపిలోని పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టు వివరాలు తమకు ఇవ్వాలని కోరారు. కర్నూలు జిల్లా పిన్నాపురం వద్ద చేపట్టిన గ్రీన్ కో ప్రాజెక్టు కోసం కృష్ణా జలాలను వినియోగించరాదని ఆయన తెలిపారు. కృష్ణా నుండి ఇతర బేసిన్లకు జలాల తరలింపుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. జల విద్యుత్ కోసం కృష్ణా జలాల వినియోగంపైనా మురళీధర్ అభ్యంతరం చెప్పారు.
అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుపైనా..
అపెక్స్ కౌన్సిల్, బోర్డు అనుమతులు లేని ప్రాజెక్టులను ఆపాలని మురళీధర్ ఈ లేఖలో కేఆర్ఎంబీ చైర్మన్ ను కోరారు. ఇంతకు ముందు కూడా ఏపి ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బోర్డుకు ఫిర్యాదు చేసింది. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును ఏపి సర్కార్ చేపడితే దీనిపైనా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై ఏపి సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.