Megastar : గత ఏడాది కరోనా కష్టకాలంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు టాలివుడ్ ప్రముఖుల నుండి సేకరించి కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఛారిటీ ద్వారా గత సంవత్సరం లాక్ డౌన్ సమయంలో సినీ కార్మికులకు నిత్యావసరాలు అందించారు. మెగాస్టార్ చిరంజీవి పర్యవేక్షణలో నాడు ఆ సహాయక కార్యక్రమాలను నిర్వహించారు.
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో సినీ కార్మికులకు సీసీసీ నేడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సినీ పరిశ్రమలో 45 దాటిన కార్మికులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నట్లు చిరు ప్రకటించారు. గత ఏడాది సేకరించిన విరాళాలు కొంత మొత్తం ఈ చారిటీలో ఉండటంతో ఆ నిధులతో గురువారం నుండి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. అపోలో ఆసుపత్రి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ గవర్నర్ తమిళ ి సై సౌందర్యరాజన్ చిరుపై ప్రశంసల వర్షం కురిపించారు. తెలుగు దిగ్గజ నటుడు చిరంజీవి గారు కరోనా క్రైసిస్ చారిటీ ద్వారా అపోలో సహకారంతో సినీ కార్మికులు, సినీ జర్నలిస్ట్ లకు ఉచితంగా వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయం. ఇది ఒక మంచి ప్రయత్నం అని ట్విట్టర్ వేదికగా చిరును ప్రశంసించారు.
Glad to know Legendary Mega Star Shri Chiranjeevi garu announced free Vaccination service amidst Corona Crisis on his own support for all Cine Artists & Journalists above 45yrs in association with @apollohealthhyd
Appreciate his Laudable effort for the society @KChiruTweets pic.twitter.com/x0sBGrGdQU— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) April 22, 2021