Telangana High Court:ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ ముగిసింది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై కోర్టులో వాదనలు ముగిసాయి. తీర్పును ధర్మాసనం రిజర్వు చేసింది. గతంలోనూ ఇదే అంశంపై రఘురామ కృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు డిస్మిస్ చేసింది. సీఎం హోదాలో వైఎస్ జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారనీ, బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారంటూ పిటిషనర్ తరపు న్యాయవాది వెంకటేష్ వాదనలు వినిపించారు. జగన్ కు నోటీసులు ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఈ పిటిషన్ పై సీబీఐ వైఖరిని హైకోర్టు ఏమిటని హైకోర్టు ప్రశ్నించగా ..సీబీఐ కోర్టు తీర్పు తరువాత పరిస్థితిలో ఏమి మార్పులేదని స్పష్టం చేసింది. దీంతో రఘురామ పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది.
మరో పక్క తెలంగాణ హైకోర్టులో జగన్ వ్యక్తిగత హజరు మినహాయింపు పిటిషన్ విచారణ దశలో ఉంది. ఈ కేసు విచారణ సందర్బంలో వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వడానికి వీలులేదంటూ సీబీఐ తన వాదనలు వినిపించింది. ప్రధానంగా ఈ రెండు కేసుల్లో తీర్పులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.
దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…
ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…
రీసెంట్గా `సర్కారు వారి పాట`తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం…
హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…