Telangana High Court: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి చెందిన అక్రమాస్తుల కేసులు సీబీఐ కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తమపై దాఖలైన కేసులను కొట్టేయాలని వివిధ చార్జిషీట్లలో నిందితులుగా ఉన్న సంస్థలు, వ్యక్తులు హైకోర్టులో క్వాష్, ఇతర పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ పిటిషన్ లపై న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణ చేపట్టారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేసులను త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని కోర్టులు భావిస్తున్నా హైకోర్టులో పిటిషన్ లు దాఖలు అవుతుండటం, వాయిదాల మీద వాయిదాలు కోరుతుండటంతో జాప్యం జరుగుతోంది.
Telangana High Court: కేసు వాయిదాలపై హైకోర్టు ఆగ్రహం
దార్మియా సిమెంట్స్ కు చెందిన పునీత్ ధార్మియా దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టిన నేపథ్యంలో వారి తరపున వాదనలు వినిపించడానికి న్యాయవాది గడువు కోరారు. వివాహం కారణంగా సీనియర్ న్యాయవాదులు రాలేదని పేర్కొన్నారు. అదే విధంగా ఏపి సీఎం జడగన్ కు దిగువ కోర్టులో విచారణ నుండి వ్యక్తిగత మినహాయింపునకు సంబంధించి దాఖలైన పిటిషన్ ను వాయిదా వేయాలని న్యాయవాది నవీన్ కుమార్ కోరారు. ఇలా న్యాయవాదులు వాయిదాలు కోరడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
వాయిదా కోరితే రూ.50వేలు జరిమానా
ఈ సందర్భంలో ధర్మాసనం సీరియస్ వ్యాఖ్యలు చేసింది. పెండింగ్ లో ఉన్న కేసుల విచారణను వాయిదా కోరితే ఖర్చుల కింద రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసులు విచారణకు వచ్చినప్పుడు న్యాయవాదులు వాదనలు వినిపించాల్సిందేననీ లేని పక్షంలో రూ.50 వేలు చొప్పున ఖర్చుల కింద హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించేలా ఆదేశాలు ఇస్తామని హెచ్చరించారు. అందరి అంగీకారంతో కేసులను లిస్ట్ చేశామనీ, ఇప్పుడు మళ్లీ వాయిదాలు కోరడం ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించారు. తదుపరి వాన్ పిక్ కేసులో 6వ నిందితుడైన రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి కేవి బ్రహ్మనందరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు కొద్ది సేపు జరిగిన అనంతరం తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?