Lock down: మరో రెండు రోజుల్లో తెలంగాణ లో ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ గడువు ముగిసిపోయే సమయం వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల 19 తర్వాత ఆంక్షల సడలింపు ఉంటుందా లేకపోతే లాక్ డౌన్ ఎత్తేస్తారా? మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తారా అన్న చర్చ జరుగుతోంది. దీనికి వివిధ వర్గాల నుంచి ఆసక్తికర సమాచారం వస్తోంది. కరోనా నేపథ్యంలో ఢిల్లీ తరహా అన్లాక్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Read More: Corona: గ్యాప్ ఇవ్వండి మహప్రభో…. దేశంలో ఇంకో కరోనా ఫంగస్….
ఆ రిపోర్టులో ఏముందంటే….
కరోనా కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గినట్టు ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ నివేదిక అందజేసింది. రాష్ట్రంలో పాజిటివ్ రేటు 1.5 శాతానికి తగ్గినట్ల్టు అందులో పేర్కొంది. దీంతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆంక్షల సడలింపు తప్పదని ప్రభుత్వ ఆలోచనగా ఉంది. తెలంగాణలో మరో వారం లేదా పది రోజుల పాటు నైట్కర్ఫ్యూ విధించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న వేళల్లో మార్పులు చేస్తూ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు వారం పది రోజుల పాటు నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉందని సమాచారం.
Read More: corona: కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే మీకు ఎన్ని డిస్కౌంట్లు, ఆఫర్లు వస్తాయో తెలుసా?
సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారంటే…
లాక్ డౌన్ సడలింపు , నూతన మార్గదర్శకాల విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితర ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు సడలింపు అవకాశం ఉందన్న టాక్ వస్తోంది. వచ్చే నెల నుంచి బార్లు, సినిమా హాళ్లు, జిమ్లకు కూడా 50 శాతం అక్యుపెన్సితో అనుమతి ఇవ్వాలని టీఆర్ఎస్ సర్కారు ఆలోచిస్తున్నట్లు కూడా అంచనా వేస్తున్నారు.