ఆంధ్రప్రదేశ్ ANDHRA PRADHESH లో ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా దేవాలయాల్లో జరుగుతున్న పలు ఘటనలు అనేకమందిలో ఆందోళనను కలిగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో రాజకీయ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం.
అయితే, కొన్ని సందర్భాల్లో అవి సవాళ్ల స్థాయికి చేరుతాయి కూడా. దీంతో కొందరి రాజకీయ జీవితాలను ప్రభావితం చేస్తుంటాయి. ఈ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి YS JAGAN MOHAN REDDY తర్వాత ఆ స్థాయిలో టార్గెట్ అవుతోంది దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు VELLAMAPALLY SRINIVAS RAO. ఆయనపై జరుగుతున్న ముప్పేట దాడి నేపథ్యంలో కొత్త చర్చ తెరమీదకు వస్తోంది.
మంత్రి సంచలన నిర్ణయం
ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి CHIEF MINISTER YS JAGAN MOHAN REDDY అటు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ MINISTER VELLAMPALLY SRINIVASARAO ను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో దేవాలయాల్లో జరుగుతోన్న వరుస ఘటనల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ ప్రభుత్వం AP GOVERNMENT ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే దేవదాయ, పోలీసు శాఖల ఉన్నతాధికారులతో మంత్రి వెలంపల్లి MINISTER VELLAMPALLY SRINIVASA RAO భేటీ కానున్నారు. దేవాలయాల్లో జరుగుతోన్న ఘటనలను నివారించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుపై సమాలోచనలు ANDHRA PRADESH GOVERNMENT ప్రభుత్వం చేస్తోంది. పోలీసు శాఖతో సమన్వయం చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లపై చర్చ ఏపీ సర్కారు AP GOVERNMENT నిర్వహించనుంది. దేవాలయాల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి వెలంపల్లి MINISTER VELLAMPALLI సమీక్షంచనున్నారు. ప్రతి దేవాలయం వద్ద సెక్యూరిటీ సిబ్బందిని నియమించే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు. ఇప్పటికే వివిధ దేవాలయాల వద్ద సీసీ కెమెరాలు పెట్టాలని దేవదాయ శాఖ నిర్ణయం తీసుకుంది.
వెల్లంపల్లి తగ్గేది లేదు
గతంలోనూ తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ YSR CONGRESS PARTY కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన వెల్లంపల్లి దేవాలయాల్లో వరుస ఘటనల్లో తెలుగుదేశం పార్టీ TELUGU DESHAM PARTY అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు NARA CHANDRA BABU NAIDU కుట్ర ఉంది అని ఆరోపించారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి, ఈ రాష్ట్రానికి సుధీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనాయకుడిగా ఉన్నానని చెప్సుకుంటూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్న వ్యక్తి చంద్రబాబునాయుడు అని మంత్రి వెల్లంపల్లి MINISTER VELLAMPALLI SRINIVASA RAO మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి CM YS JAGAN MOHAN REDDY పై, ఈ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజల్లో అపోహలు, అనుమానాలు సృష్టించే విధంగా ప్రయత్నించేందుకు చాలా కుట్రలు పన్నుతున్నారు అంటూ విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్సీపీ YSRCP హయాంలో ఏ ఒక్క దేవాలయం కూల్చలేదని, ఏదీ ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని ప్రమాణం చేస్తాను మీ హయాంలో ఒక్క ఆలయం కూడా కూల్చలేదని కాణిపాకం వినాయకుడి మీద ప్రమాణం చేయగలరా బాబూ అంటూ మంత్రి వెల్లంపల్లి MINISTER VELLAMAPALLY SRINIVASARAO సవాల్ విసిరారు. ఈ సవాల్ ను స్వీకరించకపోతే.. చంద్రబాబు ఎప్పటికీ హిందూ ద్రోహిగానే మిగులుతాడని వ్యాఖ్యానించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?