NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైఎస్ ప్రేమగా చేసిన పనిని క్యాన్సిల్ చేసిన ఏపి ప్రభుత్వం ? జగనూ ఇదెక్కడి న్యాయం?

వైఎస్ జగన్మోహనరెడ్డి ys jagan mohan reddy ముఖ్యమంత్రి cm గా బాధ్యతలు చేపట్టిన తరువాత అనేక కీలక నిర్ణయాలను తీసుకున్న సంగతి తెలిసిందే. ఓ పక్క సంక్షేమ రథాన్ని పరుగులు పెట్టిస్తూనే మరో పక్క అభివృద్ధి వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే
పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటుకు జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. టీడీపీ నేతల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా గతంలో ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని అనుభవిస్తున్న వారి జాబితాపైనా దృష్టి పెట్టారు.

The Jagan government took back the LT lands in Visakhapatnam

టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల కేటాయింపులను రద్దు చేయడమే కాక తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో జరిగిన భూ కేటాయింపులపైనా జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ క్రమంలో విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ అధారిటీ (వీఎంఆర్డీయే) పరిధిలో ఓ ప్రముఖ సంస్థకు వైఎస్ఆర్ హయాంలో వేలం ద్వారా కేటాయించిన సుమారు 40 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సదరు భూములను స్వాధీనం చేసుకోవాలంటూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మి శుక్రవారం విఎంఆర్డీయే కమిషనర్ కు ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాల్లోకి వెళితే..ఎల్ అండ్ టీ విజన్ వెంచర్స్ సంస్థ కొమ్మాాది లోని 39.89 ఎకరాలను వైఎస్ఆర్ హయాంలో వేలం ద్వారా పాడుకుంది. ఎకరం రూ.1.53 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన మొత్తంలో ఆ సంస్థ కొంత మాత్రమే చెల్లించి మిగిలిన సొమ్ము ఇంత వరకూ జమ చేయలేదు. వైఎస్ఆర్ తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఆ బకాయిలపై దృష్టి పెట్టలేదు. దీంతో ఆ సంస్థ ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం గత ఏడాది డిసెంబర్ 31 నాటికి రూ.88.73 కోట్లకు చేరుకుంది. ఈ బకాయిలు చెల్లించాలని జారీ చేసిన నోటీసులకు సంస్థ నుండి సమాధానం రాలేదు.

ఇప్పుడు విశాఖ పరిపాలనా రాజధానిగా డిక్లేర్ అవుతుండటంతో ఆ భూముల విలువ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఈ భూములు ఎకరం రూ. ఆరు కోట్లకు పైగా పలుకుతున్నాయి. ఈ లెక్కన పాత ధరల ప్రకారం ఆ సంస్థకు భూములను కేటాయించినట్లైయితే ప్రభుత్వానికి రూ.99 కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని అధికారులు గుర్తించారు. అంతే కాకుండా ఏంతో విలువైన భూములను చాలా తక్కువ ధరలకు కేటాయించడంపైనా పలు ఫిర్యాదులు అందాయని ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పేర్కొంది. ఈ భూముల కేటాయింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పటికే ఆ సంస్థ చెల్లించిన మొత్తాన్ని సాధారణ వడ్డీతో తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విఎంఆర్డీయేను ప్రభుత్వం ఆదేశించింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N