ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా దేవాలయాలపై అదేవిధంగా విగ్రహాలపై దాడులు జరగడం బాధాకరమని చాలా మంది చెబుతున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే పొలిటికల్ మైలేజ్ సంపాదించడానికి ప్రజల భావోద్వేగాలతో ప్రధాన పార్టీలు చెలగాటమాడుతున్నాయి అని మండిపడుతున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉంది. ఇదిలా ఉండగా అసలు విగ్రహం ధ్వంసం అయిందని మొట్టమొదట సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్లని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
ఓటుకు నోటు కేసు తెరపైకి రావడంతో పాటు జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో మతాల ద్వారా ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి టిడిపి ఆడుతున్న డ్రామా అంటూ చాలామంది చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే జరిగిన ఈ ఘటనపై సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుడు సుమన్ స్పందించారు. ఖచ్చితంగా ఇది ప్రతిపక్షాల కుట్ర అంటూ పేర్కొన్నారు. ఈ విషయంలో అధికార పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, జగన్ ప్రభుత్వంపై కుట్రపూరితంగా ప్రతిపక్షాలు ఆడుతున్న డ్రామా అంటూ సుమన్ ఆరోపించారు.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి దేవాలయం, చర్చి అదేవిధంగా మసీదుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఏపీ ప్రభుత్వానికి సుమన్ సూచనలు ఇచ్చారు. త్వరలో తిరుపతిలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ఇలాంటి సంఘటనలను ఆధారం చేసుకుని పొలిటికల్ మైలేజ్ సంపాదించడానికి ప్రతిపక్షాలు అధికార పార్టీపై ఆడుతున్న డ్రామాలు అంటే చాలామంది విగ్రహాల ధ్వంసం ఘటనపై స్పందిస్తున్నారు. ఏది ఏమైనా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు గుళ్ళ చుట్టూ విగ్రహాలు చుట్టూ తిరగటం రాష్ట్రంలోనే కాక దేశంలోనే సంచలనంగా మారింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?