టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుకు వైసీపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇంతకు ముందే మాన్సాస్ ట్రస్ నుండి అశోక్ గజపతిరాజును తప్పించిన విషయం తెలిసిందే,. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ఆలయ చైర్ పర్సన్ బాధ్యతలను అశోక్ గజపతి రాజు అన్న కుమార్తె సంచయిత గజపతిరాజు ను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు తాజాగా మూడు ప్రముఖ ఆలయాలకు ధర్మకర్త బాధ్యతల నుండి కూడా అశోక్ గజపతిరాజుకు ప్రభుత్వం ఉధ్వాసన పలికింది. రామతీర్థం రామాలయం, విజయనగరం పైడితల్లి, మందపల్లి ఆలయాల ధర్మకర్త హోదా నుండి అశోక్ గజపతిరాజు ను తొలగిస్తూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన జివో 65 ను ఉపసంహరిస్తూ దేవాదాయ శాఖ మెమో ఇచ్చింది. ఈ పరిణామంతో టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అశోక్ గజపతిరాజు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.