Lock Down: కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుతూ వస్తుండటం కొన్ని రాష్ట్రాల్లో నమోదవుతున్న కొవిడ్ కేసుల సంఖ్య పెద్ద ఎత్తున తగ్గుతున్న నేపథ్యంలో అన్లాక్ దిశగా పలు రాష్ట్రాలు అడుగులు వేస్తున్నాయి. పలు దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తగ్గనప్పటికీ.. ఇప్పటికే కేసులు తగ్గుముఖం పట్టిన రాష్ట్రాల్లో అన్ లాక్ ప్రక్రియ మొదలయింది. ఈ జాబితాలో తెలంగాణ కూడా చేరనున్నట్లు సమాచారం.
Read More: Corona: కరోనాతో పిల్లలకు ప్రమాదం లేదు – ఎవరు ప్రకటించారో తెలుసా?
ఢిల్లీలో మొదలైంది…
దేశ రాజధాని ఢిల్లీలో మే 31 నుంచి అన్లాక్ ప్రక్రియ మొదలైంది. ఢిల్లీలో మెట్రో సేవలు నేటి నుంచి 50 శాతం కెపాసిటీతో ప్రారంభం కానున్నాయి. అలాగే మార్కెట్లు, మాల్స్ కూడా సరి, బేసి పద్ధతిలో తెరుచుకోనున్నాయి. ఢిల్లీ పొరుగు రాష్ట్రమైన
ఉత్తర్ ప్రదేశ్లో కూడా నేటి నుంచి లాక్డౌన్ సడలింపులు ఉంటాయని యోగి ప్రభుత్వం తెలిపింది. కంటైన్మెంట్ జోన్ల్లో వారంలో ఐదు రోజులపాటు మార్కెట్లు, షాపులు తెరుచుకోవచ్చునని స్పష్టం చేసింది. అయితే నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్ మాత్రం కొనసాగుతుందని పేర్కొంది. రాజస్థాన్లో ఈనెల 2వ తేదీ నుంచి అన్లాక్ ప్రక్రియ మొదలైంది. పలు సడలింపులతో అన్లాకింగ్ను అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింద.
Read More: Corona: వాట్సాప్ తో కరోనా టెస్ట్ … ఎంత ఈజీగా చేసుకోవచ్చంటే…
తెలంగాణలో ఇదీ రచ్చ
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 9 వరకు లాక్డౌన్ కొనసాగనుంది. ఆ తర్వాత లాక్డౌన్ను కొనసాగిస్తారా లేదా సడలింపులతో అన్లాక్ ప్రక్రియను మొదలెడతారా అనేది త్వరలో తేలనుంది. అయితే, తెలంగాణలో లాక్డౌన్ వల్ల కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో లాక్డౌన్ను పగటివేళల్లో ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానుంది.