Lock Down: ఇప్పుడు అందరి దృష్టి లాక్ డౌన్ పైనే. కోవిడ్ లేని సమయంలో లాక్డౌన్ అంటూ హడావిడి చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు లాక్డౌన్ బాధ్యత మాది కాదు కట్టడి చర్యలు రాష్ట్రాలే అంటోంది. అయితే, దేశంలో ఇప్పుడున్న పరిస్థితులపై స్పందించిన ఆలిండియా ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కీలక సూచనలు చేసింది. అదే సమయంలో కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి కిషన్రెడ్డి కీలక ప్రకటన చేశారు.
ఎయిమ్స్ పెద్దాయన ఏమంటున్నారంటే…
కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఎయిమ్స్ చీఫ్ రణ్దీప్ గులేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను కరోనా చిన్నాభిన్నం చేస్తోంది, వెంటనే మెరుగైన హెల్త్కేర్ వసతులు కల్పించండి లేదంటే కోవిడ్ కేసులను తగ్గించండి. రోజూ రికార్డు స్థాయిలో వెలుగు చూస్తోన్న కేసులను భరించడం సాధ్యం కాదని ఎయిమ్స్ అధిపతి హెచ్చరించారు. వెంటనే కోవిడ్ 19 చెయిన్ను బ్రేక్ చేయాల్సిన అవసరం ఉందన్న ఎయిమ్స్ చీఫ్ దీనికోసం కనీసం 10 శాతం పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లో వెంటనే లాక్డౌన్ విధించాల్సిందేనని సూచించారు. ఈ సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడటం చాలా ముఖ్యం.. కేసులు పెరిగిపోతుండటం వల్ల ఆరోగ్య వ్యవస్థ మూల్యం చెల్లించాల్సి వస్తోందని హెచ్చరించారు.
కేంద్ర మంత్రి కీలక ప్రకటన
కోవిడ్ పరిస్థితి, ఆక్సిజన్, బెడ్ల కొరత లాంటి అంశాలపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని కానీ, పది రాష్ట్రాల కోసం కేంద్రం లాక్ డౌన్ పెట్టలేదు అని స్పష్టం చేశారు. కేసుల తీవ్రతను బట్టి.. లాక్ డౌన్పై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలదేన్న కేంద్ర మంత్రి.. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీరుస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రాల్లో కేసులు, మరణాల లెక్కల ప్రకారమే కేంద్రం కేటాయింపులు ఉంటాయని కిషన్ రెడ్డి అన్నారు.