Somu Veerraju : సోము వీర్రాజు … ఏపీ బీజేపీ అధ్యక్షుడు. సీనియర్ రాజకీయ వేత్త. అలాంటప్పుడు సంచలనాల కోసమే మాట్లాడుకూడదు. అయినప్పటికీ, ఏపీ బీజేపీ అధ్యక్షుడి హోదాలోనే.. సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరినో సీఎం చేయడానికి బీజేపీ అధికారం కోరుకోవడం లేదన్న ఆయన అభివృద్ధి ద్వారా ఏపీ రూపురేఖలు పూర్తిగా మార్చాలన్నదే మా తపన అని అన్నారు. బీసీలను సీఎం చేసే దమ్ము చంద్రబాబు, జగన్కు ఉందా? అని అయన ప్రశ్నించారు. బీసీలను ముఖ్యమంత్రిని చేసే దమ్ము బీజేపీకి మాత్రమే ఉందని అన్నారు. అయితే వెంటనే తేడా కొట్టేసిందట.
Somu Veerraju : ఏపీ రాజకీయాల గురించి చెప్తూ…
ఏపీలో రాజకీయాల గురించి మాట్లాడిన సోము వీర్రాజు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలోకి వలసల జోరు కొనసాగుతోందని వెల్లడించారు. టీడీపీ, వైసీపీ నేతలు బీజేపీలో చేరబోతున్నారని అన్నారు. టీడీపీ, వైసీపీ నేతలు బీజేపీతో చర్చలు జరుపుతున్నారని అన్నారు. త్వరలో వారి పేర్లను వెల్లడిస్తాం అని అని అన్నారు. దేశంలో బీసీలు బీజేపీతోనే ఉన్నారని.. పార్టీ ఒక బీసీని ప్రధానిని చేసిందని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీలు బీసీని ముఖ్యమంత్రిగా చేయగలవా అని సోము వీర్రాజు ఛాలెంజ్ కూడా చేశారు. అంతేకాదు బీసీలను సీఎం చేసే దమ్ము ఒక్క బీజేపీకే ఉందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.
వెంటనే మాట మారిపోయిందిగా…
బీసీ సీఎం అని కొత్త పల్లవి అందుకున్న సోము వీర్రాజు తెల్లారే సరికల్లా మాట మార్చేశారు. ఏపీలో సీఎం అభ్యర్థి ఎవరు అనేది తన చేతుల్లో లేదని వీర్రాజు వెల్లడించారు. సీఎం అభ్యర్థి ఎవరో తమ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ కలిసి నిర్ణయిస్తారని అన్నారు. సీఎంగా బీసీలు కావొచ్చు, కాపులు కావొచ్చని పేర్కొన్నారు. మొత్తంగా జనసేన వర్గాల నుంచి , కాపుల నుంచి వచ్చిన ఒత్తిడే ఈ మేరకు ప్రకటించేందుకు కారణమని పలువురు కామెంట్ చేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?