TDP: వైఎస్ఆర్ జిల్లా కమలాపురంకు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్ శర్మను గుర్తు తెలియని వ్యక్తులు పరోక్షంగా బెదిరించారు. ఆయన కారును ధ్వంసం చేశారు. రాజకీయాలు మానుకోకుంటే అంతుచూస్తామంటూ కారుకు బెదిరింపు లేఖలు అంటించారు. రాజకీయాలకు దూరం కాకుంటే చంపేస్తామంటూ కాగితంపై రాసి కారుకు అంటించారు. రాజకీయాలు మానుకోకుంటే కారుకు పట్టిన గదే నీకూ పడుతుందంటూ హెచ్చరిక కాగితాలను కారుకు, ఇంటి గోడకు అతికించారు. కమలాపురం రామాపురం ఆలయం వద్ద కారు నిలిపి ఉండగా దుండగులు దాడి చేసి ధ్వంసం చేశారు. రామాపురం క్షేత్రంలో స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో నిద్రస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటిన కారు ధ్వంసం చేసినట్లు టీడీపీ నేతలు భావిస్తున్నారు. దీనిపై సాయినాథ్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా రేపు కమలాపురం పర్యటనకు వస్తున్న సందర్భంగా ఈ ఘటన జరగడం హాట్ టాపిక్ అయ్యింది. సాయినాథ్ శర్మ కొన్ని రోజులుగా టీడీపీ చేపడుతున్న కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దీనిపై సాయినాథ్ శర్మ మాట్లాడుతూ ఎవరి బెదిరింపులకు భయపడననీ, ప్రాణాలకు తెగించి రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. రాజకీయాలు మానుకోవాలని లేఖలు పెట్టడం పిరికిపందల చర్య అని అయన అన్నారు. రేపు చంద్రబాబు పర్యటన ఉండగా ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని ఆయన అన్నారు.