Breaking: ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామ శివారు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కుమారుడుతో పాటు మరో బాలిక మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. తునికిపాడు శివారు ఖమ్మం జిల్లా సరిహద్దు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్ లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి కొడుకులు కొమ్మినేని శ్రీకాంత్ (35), వర్షిత్ (5), మరో బైక్ పై ప్రయాణిస్తున్న గజ్జల మురళీృష్ణ కుమార్తె నాగలక్ష్మి (8) మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తొంది. మృతి చెందిన వారంతా తునికిపాడుకు చెందిన వారు కావడంతో పండుగ పూజ ఆ గ్రామంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో కొమ్మినేని శ్రీకాంత్, గజ్జల మురళీకృష్ణ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతుల బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.