NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Kakinada: గుడిలోకి దూసుకువెళ్లిన లారీ .. ముగ్గురు మృతి

Advertisements
Share

Kakinada: కాకినాడ జిల్లా తాండంగి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గ్రావెల్ లోడ్ తో వెళుతున్న లారీ బీభత్సం సృష్టించడంతో ముగ్గురు మృతి చెందారు. అన్నవరం నుండి ఒంటిమామిడి వైపు వెళుతున్న గ్రావెల్ లోడ్ లారీ ఏ కొత్తపల్లి లో రోడ్డు పక్కన ఉన్న తాగునీటి ట్యాంక్ ను ఢీకొట్టి పక్కనే ఉన్న వినాయకుడి గుడిపైకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదం ఆదివారం వేకువజామున జరిగింది.

Advertisements
Three Died in road accident Kakinada district

 

ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ చుక్కల శేఖర్ (28), క్లీనర్ కోనూరు నాగేంద్ర (23), తో పాటు గుడిలో నిద్రిస్తున్న స్థానికుడు సోము లక్ష్మణరావు (48) అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు శేఖర్, నాగేంద్రలు ప్రత్తిపాడు మండలం గజ్జనపూడి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో తొండంగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్ర మత్తులో నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు.

Advertisements

అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు కీలక భేటీ .. ఊపందుకున్న ఊహగానాలు


Share
Advertisements

Related posts

ప్రాజెక్టు పూర్తికి మరో మూడేళ్లు

somaraju sharma

అమరావతి ఉద్యమం హైలెట్ అవటానికి చంద్రబాబు సరికొత్త ఎత్తుగడ..!!

sekhar

జీవిత ఖైదు మహిళలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..! అదేమిటంటే..?

Special Bureau