Yerravaripalem(Chittoor): చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండలంలో ఘోర విషాద ఘటన జరిగింది. యర్రవారిపాలెం మండలం ఎల్లమంద పంచాయతీ తంబిరెడ్డిగారిపల్లె గ్రామానికి చెందిన వృద్దుడుతో పాటు పాటు ఇద్దరు మనమళ్లు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు.
విషయంలోకి వెళితే.. గ్రామానికి చెందిన నాగముని (66) చేపల వేట కోసం తన ఇద్దరు మనమళ్లు మణికంఠ, జగదీష్ లతో కలిసి గాజుల ఏరులోన డ్యామ్ వద్దకు వెళ్లారు. చేపల కోసం వల వేసిన నాగముని అదే వలలో చిక్కుకున్నారు. దీంతో తాతను కాపాడేందుకు ఇద్దరు మనమళ్లు ప్రయత్నించడంతో వారు నీటిలో మునిగి మృతి చెందారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాగముని, మనమళ్లు మణికంఠ, జగదీశ్ మృతదేహాలను బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
CBI: సీబీఐ నూతన బాస్ గా ప్రవీణ్ సూద్
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?