Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించడం తెలిసిందే. ఆ సమయంలో జరిగిన రోడ్ షోలో 8 మంది తొక్కిసలాటలో మరణించడం జరిగింది. ఇదిలా ఉంటే ఈరోజు కొత్త సంవత్సరం నేపథ్యంలో సంక్రాంతి కానుకగా “చంద్రన్న కానుక” గుంటూరులో పంపిణీ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక తీసుకోవడానికి చంద్రబాబు వెళ్ళిన తర్వాత మహిళలు భారీ ఎత్తున రావడంతో తొక్కిసలాట జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికక్కడ ఓ మహిళ చనిపోగా హాస్పిటల్ కి వెళ్ళాక చికిత్స తీసుకుంటూ ఇద్దరు చనిపోయారు.
దీంతో టీడీపీ నేతలలో నైరశ్యం నెలకొంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సభలు విషాదాలకు కారణం అవుతూ ఉండటంతో క్యాడర్ లో నిరాశ నెలకొంటుంది. నాలుగు రోజుల క్రితం కందుకూరులో 8 మంది ఇప్పుడు గుంటూరులో ముగ్గురు చనిపోవడం పార్టీలో తీవ్ర విషాదఛాయలు నింపాయి. అయితే తమ సభలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే ఇంతటి విషాదానికి కారణం తెలుగుదేశం పార్టీ ప్రచారం అని అంటున్నారు.
దాదాపు 30 వేల మంది మహిళలకు కానుకలు ఇస్తామంటూ ప్రచారం చేయడంతో పెద్ద ఎత్తున మహిళలు రావడంతో.. ఒక్కసారిగా జరిగిన తోపులాటలో ముగ్గురు మరణించడం జరిగింది. గుంటూరు వికాస్ నగర్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. మరో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ సంఘటనతో సభ నిర్వహకులు మరియు చంద్రబాబుపై ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త సంవత్సరం మొట్టమొదటి రోజే… ఈ దారుణం చోటు చేసుకోవడంతో.. తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కానుకలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు ప్రసంగించినంత సేపు సభ సజావుగానే సాగింది. ఆయన వెళ్లిపోయిన అనంతరం ఒక్కసారిగా వచ్చిన ప్రజలను సభ నిర్వహకులు నియంత్రించలేకపోయారు. దీంతో అక్కడికక్కడే గోపిశెట్టి రమాదేవి మరణించగా ఆసుపత్రిలో రాజ్యలక్ష్మి మరియు సయ్యద్ ఆసీమ ప్రాణాలు విడవడం జరిగింది.