Tragedy: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలో విషాదం చోటుచేసుకుంది. వంశధార కాల్వలో స్నానానికి వెళ్లిన ముగ్గురు మృతి చెందారు. మృతులు తండ్రీ కొడుకులు నాగరాజ్ , తులసీరాజ్, మరో వ్యక్తి వెంకట రమణగా గుర్తించారు. నిమ్మాడకు చెందిన ఈ ముగ్గురు నిన్న రాజపురంలో వంశధార కాల్వలో స్నానానికి వెళ్లారు. వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో వారి బంధులు, స్థానికులు ముగ్గురి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం రాత్రి నాగరాజ్ కుమారుడు తులసీరాజ్ మృత దేహం లభ్యమైంది.
సోమవారం నాగరాజు, వెంకట రమణ మృత దేహాలు కాలువ లో తేలుతూ కనిపించాయి. స్నానానికి వెళ్లి వారు ప్రమాదవశాత్తు కాలువలో జారి మరణించి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనతో నిమ్మాడ గ్రామంలో విషాదం అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Breaking: ఢిల్లీ పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .. ఆ ఇద్దరు కీలక నేతలతో భేటీ..?
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?