Road Accident: నంద్యాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పండుగ పూట మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. నంద్యాల జిల్లా డోన్ సమీపంలోని దొరపల్లి బ్రిడ్జ్ వద్ద జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలను ఐచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
దొరపల్లికి చెందిన ఎల్ల కృష్ణ, రామకృష్ణ, సందీప్ లు సెకండ్ షో సినిమాకు వెళ్లి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు యువకులు దుర్మరణం చెందడంతో వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సంక్రాంతి పండుగ వేళ దొరపల్లిలో విషాద శ్చాయలు అలుముకున్నాయి.
Ukraine Russia War: తొమ్మిది అంతస్తుల భవనంపై క్షిపణి దాడి .. 12 మంది మృతి
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?