Tirupathi : ఏపీలో ఇప్పుడు అందరి చూపు తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక గురించే. అధికార వైసీపీ ఎంపీ ఆకస్మిక మృతితో ఈ ఉప ఎన్నిక వచ్చిపడింది. ఈ ఉప ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది.. దీంతో ఎన్నిక సంఘం అధికారులు ఫైనల్గా బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అయితే, ఇదే సమయంలో బీజేపీ నేతలు సంచలన కామెంట్లు చేస్తున్నారు.
జగన్ జైలుకేనట….
ఎన్నికల బరిలో ప్రధానంగా వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి, తెలుగుదేశం పార్టీ నుంచి పనబాక లక్ష్మి, బీజేపీ-జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ, సీపీఎం అభ్యర్థి యాదగిరి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చింతామోహన్ బరిలో ఉన్నారు. అయితే, ఈ ప్రచారంలో భాగంగా నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబులపై బీజేపీ రాష్ట్ర సహ ఇంచార్జ్ సునీల్ దేవ్ ధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రౌడీరాజ్యం నడుస్తోందని ఆయన అన్నారు. బెయిల్ పై బయట ఉన్న వ్యక్తి సీఎంగా కొనసాగుతున్నారని చెప్పారు. అంతేకాదు, జగన్ బెయిల్ ఏ క్షణమైనా రద్దయ్యే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు. సీఎం జగన్ బెయిల్ గురించి సునీల్ దేవ్ ధర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇందులో ఏదైనా మతలబు ఉందా? లేక.. బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందా? అనే చర్చ నడుస్తోంది.
వీరే పోటీలో ఉంది…
ఇదిలాఉండగా తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీచేసేందుకు మొత్తం 34 మంది నామినేషన్లు దాఖలు చేశారు.. అందులో నాలుగు నామినేషన్లను అధికారులు తిరస్కరించడంతో నామినేషన్ల సంఖ్య 30కి పడిపోగా.. ఇవాళ ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఫైనల్గా 28 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నట్టు అయ్యింది. ఫైనల్గా పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా తేలిపోవడంతో.. తదుపరి ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ దృష్టిసారించింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?