Tirupathi Bypoll : రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ, Panchayat మున్సిపల్ Municipality elections ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి వైసీపీ YCP ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికపై దృష్టి సారించింది. స్వయంగా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి, వైఎస్ జగన్మోహనరెడ్డి YS Jagan Mohan Reddy తిరుపతి Tirupathi ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి అత్యధిక మెజార్టీతో విజయం సాధించేందుకు మంత్రులకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వైసీీపీ అభ్యర్థి ఘన విజయానికి కృషి చేయాలన్నారు. ఈ క్రమంలో భాగంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు ఎడుగురు మంత్రులకు ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించారు.
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, సత్యవేడు నియోజకవర్గానికి పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, గూడూరు నియోజకవర్గానికి నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సూళ్లూరుపేట నియోజకవర్గానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కురసాల కన్నబాబు, సర్వేపల్లి నియోజకవర్గానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వెంకటగిరి నియోజకవర్గానికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డిలను ఇన్ చార్జిలుగా నియమించిన వైఎస్ జగన్..మొత్తం పార్లమెంట్ ఎన్నికల పూర్తి వ్యవహారాల బాధ్యతలను పార్టీ కీలక నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు అప్పగించారు.
వైసీపీ నుండి తిరుపతి ఎంపిగా గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ కొద్ది నెలల క్రితం కరోనా సోకి మృతి చెందిన నేఫథ్యంలో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. దివంగత ఎంపి దుర్గాప్రసాద్ తనయుడు బల్లి కల్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా సీఎం వైఎస్ జగన్ ఆ కుటుంబానికి న్యాయం చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కాలం నుండి ఆ కుటుంబానికి విధేయుడుగా ఉండటంతో పాటు జగన్మోహనరెడ్డి పాదయాత్రలో చివరి వరకూ తన సేవలను అందించిన డాక్టర్ గురుమూర్తిని తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల వైసీపీ అభ్యర్థిగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.