Tirupathi By Election: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల బరిలో ప్రధాన రాజకీయ పక్షాలతో సహా మొత్తం 28 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపు అనంతరం ఎన్నికల సంఘం ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయనే వివరాలు ప్రకటించింది. ఈ ఎన్నికల్లో 2లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Tirupathi By Election: అభ్యర్థుల వారీగా పోల్ అయిన ఓట్ల వివరాలు ఇవి
కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి చింతా మోహన్ కు 9,383, కమ్యునిస్టు పార్టీ అఫ్ ఇండియా (మార్కిస్ట్) అభ్యర్థి నెల్లూరి యాదగిరికి 5890, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 3,45,128, వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తికి 6,11,116, బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 56,035, జనవాహిని పార్టీ అభ్యర్థి గుడిమళ్ల బాబుకు 676, నవతరం పార్టీ అభ్యర్థి డాక్టర్ రమేష్ కుమార్ కు 4105, ఇండియా ప్రజా భందు పార్టీ అభ్యర్థి పల్లె నాగరాజుకు 1353, ప్రజాఏక్తా పార్టీ అభ్యర్థి బండారు నాగరాజుకు 2391, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బక్కా శైలజకు 3070, అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్యామ్ ధాన్ కూరపాటికి 1229, హిందూస్థాన్ జనత పార్టీ అభ్యర్థి వెంకటేశ్వర మహా స్వామిజీ 3047, మహాజన రాజ్యం పార్టీ అభ్యర్థి మనోహర్ కు 933 ఓట్లు పోల్ అవ్వగా ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులకు 200 నుండి 4600 వరకూ ఓట్లు పోల్ అయ్యాయి. నోటాకు 15,182 ఓట్లు పోల్ కావడం గమనార్హం.
అభ్యర్థుల వారీ ఓట్ల పూర్తి వివరాల కోసం ఈ కింద లింక్ ను క్లిక్ చేయండి
Election Commission of India@ 4.45 pm