Tirupati By Election: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ఫలితం వెెల్లడైంది. వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి 2లక్షల 31వేల పైచికులు మెజార్టీతో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి పై విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి 6,08,583 (56.7శాతం) ఓట్లు పోల్ కాగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 3,45,902 (32.2 శాతం) ఓట్లు వచ్చాయి. ఇక బీజెపీ అభ్యర్థి రత్న ప్రభకు 55,924 (5.2 శాతం), కాంగ్రేస్ అభ్యర్థి చింతా మోహన్ కు 9,322 ఓట్లు పోల్ అయ్యాయి. నోటాకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంటే 15,103 (1.04) ఓట్లు పోల్ కావడం విశేషం.
వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తొలి రౌండ్ నుండి లీడ్ లో కొనసాగారు. తొలి నుండి వైసీపీ అభ్యర్థి ఘన విజయం ఖాయమని అందరూ అనుకుంటున్నా మెజార్టీ పైనే అందరి అంచనాలు ఉన్నాయి. గత ఎన్నికలలోనూ 2లక్షల 20వేలకుపైగా ఓట్ల ఆధిక్యతతో వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ విజయం సాధించారు. ఆయన కరోనా బారిన పడి అకాల మృతి చెందడంతో తిరుపతి పార్లమెంట్ కు ఉప ఎన్నిక జరిగింది. అయితే వైసీపీ ఈ ఎన్నికల్లో 5లక్షలకుపైగా మెజార్టీ లక్ష్యంగా నిర్ధేసించుకుందని వార్తలు వచ్చాయి. కరోనా నేపథ్యంలో పోలింగ్ శాతం తగ్గింది. దీంతో వైసీపీ మెజార్టీ వారు ఆశించిన స్థాయిలో రాలేదు. విజయం సాధించిన డాక్టర్ గురుమూర్తిని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డితో సహా ఆ పార్టీ నేతలు అభినందించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?