Tirupati By Poll: ప్రముఖ హాస్య నటి కొల్లా హేమ నేడు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు సమక్షంలో హేమ బీజేపీ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల సమయంలో హేమ వైసీపీలో చేరారు. ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. ఇప్పుడు ఆమె వైసీపీని వీడి బీజేపిలో చేరారు.
బీజేపీలో చేరిన సందర్భంగా హేమ మాట్లాడుతూ తాను 500లకు పైగా సినిమాలు నటించానన్నారు. బీజేపీలో సేవకురాలిగా జాయిన్ అవ్వడానికి వచ్చానని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సమక్షంలో పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడు అన్న పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా చూశాననీ చాలా నచ్చిందన్నారు.. ఆడవాళ్లను తొక్కేస్తున్న ప్రస్తుత సమాజంలో పవన్ కల్యాణ్ మంచి మేసేజ్ ఇచ్చారన్నారు. ఆడవాళ్లపై అత్యాచారాలపై ప్రధాన మంత్రి మోడీ ఎలా రియాక్ట్ అయ్యారో అందరికీ తెలుసునన్నారు. బీజేపీకి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలనీ, తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభకు మంచి మెజార్టీతో గెలిపించాలని హేమ కోరారు.
ప్రముఖ హాస్యనటి శ్రీమతి కొల్లా హేమ గారు నేడు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది.#TirupatiWelcomesNadda pic.twitter.com/QIzuSbrkKI
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) April 12, 2021
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?