Tirupati By poll : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతల విమర్శలు, ప్రతి విమర్శలు హీట్ పుట్టిస్తున్నాయి. జనసైనికుల మద్దతు ఎలాగైనా కూడగట్టుకోవాలన్న ఆశతో బీజెపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నది. ఈ తరుణంలోనే ఏపికి కాబోయే సీఎం పవన్ కల్యాణ్ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కొత్త రాగం ఎత్తుకున్నారు. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్శింహరావు కూడా అదే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు బీజేపీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సోము వ్యాఖ్యలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తన దైన శైలిలో సెటైర్ లు వేశారు. నేరుగా ఎవరి పేరు, పార్టీల పేర్లు ప్రస్తావించకుండానే నేరుగా వారికి తగిలే విధంగానే విమర్శలు గుప్పించారు విజయసాయిరెడ్డి.
ఇప్పుడు జరుగుతున్నది తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నిక జరుగుతుంటే కాబోయే సీఎం ఫలానా అంటూ బిస్కట్ వేయడం కాక మరేమిటని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం సీటు ఆఫర్ చేస్తున్న పార్టీకి ఒక్క రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేదన్నారు. దాన్ని తీసుకునే పార్టీకి కనీసం ఉనికి కూడా లేదని పేర్కొన్నారు. జోగిజోగి రాసుకుంటే బూడిద రాలిందట..కనీసం ఎమ్మెల్యే కూడా కాని వాడు ఏకంగా సీఎం కుర్చీ ఎక్కుతాడట విడ్డూరంగా లేదు అంటూ సెటైర్ వేశారు విజయసాయిరెడ్డి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?