Tragedy: ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం కవలకుంట్ల, కొత్తూరు గ్రామాల్లో విషాదం చోటుచేసుకుంది. ఈత సరదా తీర్చుకోవడం కోసం చెరువులోకి దిగిన నలుగురు విద్యార్ధులు మృతి చెందారు. ఈత కొట్టేందుకు నలుగురు విద్యార్ధులు కవలకుంట్ల చెరువులోకి దిగారు. కొద్దిసేపు సరదాగా గడిపారు. అంతలోనే ప్రమాదవశాత్తు ఆ నలుగురు పిల్లలు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మృతులు సాయిరెడ్డి (12), విష్ణుకుమార్ రెడ్డి (13), బ్రహ్మరెడ్డి (14), మణికంఠ (14)గా గుర్తించారు. చిన్నారులు మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన చూపరుల హృదయాలను కలచివేసింది. ఘటనా స్థలానికి పోలీసులు, రెవెన్యూ అధికారులు చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.