Tragedy in armoor : రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే మాదిరిగా మరణాల సంఖ్య పెరుగుతోంది. కుటుంబాల్లో కరోనా తీవ్ర విషాదాన్ని నింపుతోంది. రెండు రోజుల క్రితం ఏపిలోని విజయవాడలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన మరువక ముందే తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో నేడు దంపతులు కరోనా కాటుకు బలి అయ్యారు. ఉదయం భర్త మృతి చెందగా అతని అంత్యక్రియలు జరగకముందే భార్య కూడా మరణించింది. గంటల వ్యవధిలోనే దంపతులు ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కు చెందిన ఎంఐఎం నాయకుడు గోరిమియా ఇటీవల కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కూడా కరోనా టెస్ట్ లు చేయించుకున్నారు. భార్య కూడా పాజిటివ్ రిపోర్టు రావడంతో దంపతులు ఇద్దరూ హైదరాబాద్ లోని ఒ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు బుధవారం ఉదయం గోరేమియా ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబ సభ్యులు వెెంటనే ఆయన మృతదేహాన్ని ఆర్మూరు కు తరలించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా మరో విషాదం చోటుచేసుకుంది. గోరిమియా భార్య ఆరోగ్యం కూడా క్షీణించి మృతి చెందినట్లు సమాచారం అందింది. గంటల వ్యవధిలో కరోనా కారణంగా భార్య, భర్త ఇద్దరూ మృతి చెందడం గ్రామస్తుల హృదయాలను కలచివేసింది.
ఆ దుర్ఘటనలను చూసి అయినా కరోనా సామూహిక వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తారని ఆశిద్ధాం..
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?