Tragedy: చిత్తురు జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. విద్యుతాఘాతంతో ముగ్గురు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం కనికాపురం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన మునిస్వామి నాయుడు తన ఇల్లు నిర్మాణానికి టిప్పర్ తో కంకర తెప్పించాడు. కంకర లోడ్ తీసుకువచ్చిన టిప్పర్ డ్రైవర్ మనోజ్ ఆ ఇంటి సమీపంలో ఉన్న విద్యుత్ తీగలను గమనించకుండా టిప్పర్ వెనుక భాగం పైకి ఎత్తాడు. ఈ సమయంలో టిప్పర్ కు విద్యుత్ తీగలు తలగడంతో కరెంటు ప్రవహించింది.
విద్యుత్ షాక్ కొట్టడంతో డ్రైవర్ మనోజ్ కేసులు వేశాడు. ఇది గమనించిన అదే గ్రామానికి చెందిన యువకులు దొరబాబు (23), జ్యోతీశ్వర్ (19) డ్రైవర్ మనోజ్ ను కాపాడే ప్రయత్నంలో వీరు విద్యుతాఘాతానికి గురైయ్యారు. అక్కడి వారు చూస్తుండగానే ముగ్గురూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుతాఘాతంతో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదశ్ఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు.