TS CM KCR: తెలంగాణ సర్కార్ లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో రిజిస్ట్రేషన్ లపై కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సీఎం కేసిఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రగతి భవన్ లో దాదాపు అయిదు గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. లాక్ డౌన్ ను మరో పది రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న సర్కార్ సడలింపు వేళలను పొడిగించింది. ఈ రోజు వరకూ ఉదయం 6గంటల నుండి 10 గంటల వరకూ లాక్ డౌన్ సడలింపు ఉండగా రేపటి నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ సడలింపు ఇచ్చింది.
లాక్ డౌన్ సడలింపు నేపథ్యంలోనే.. ప్రభుత్వ పనిదినాల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో జరిగే భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లతో పాటు, రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిగే వాహనాల రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు అనుమతించాలని మంత్రివర్గం నిర్ణయించింది. లాక్ డౌన్ కారణంగా ఇప్పటి వరకూ భూములు, ఆస్తులు, బైక్ రిజిస్ట్రేషన్ లకు అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రేపటి నుండి రిజిస్ట్రేషన్లు తిరిగి ప్రారంభం కానున్నాయి.