TTD: దేశంలో, రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజకు కరోనా కేసులు పెరుగుతుండటంతో భయంతో ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. అదే విధంగా పుణ్యక్షేత్రాల సందర్శన, ఇతర పర్యటనలను వాయిదా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడి) ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 21 నుండి 30వ తేదీ వరకూ ఆన్ లైన్ లో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ లు బుక్ చేసుకున్న వారు కరోనా కారణంగా రాలేకపోతే వారు 90 రోజుల్లో ఎప్పుడైనా శ్రీవారి దర్శనం చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకున్నది. అదే విధంగా దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధపడే భక్తులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని సూచించింది. తిరుమల శ్రీవారి దర్శనంకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపింది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో మరో కీలక నిర్ణయం కూడా టీటీడీ తీసుకుంటుందని సమాచారం. కరోనా విజృంభణ ఇదే విధంగా కొనసాగితే మే నెలకు సంబంధించి రూ.300 ప్రత్యక దర్శన టికెట్ల కోటాను రోజుకు 25వేల నుండి 15వేలకు తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మే నెలకు సంబంధించి రూ.300 దర్శన టికెట్ల కోటాను మంగళవారం (రేపు) ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.