తిరుమల లో దైవ దర్శనం కన్నా వసతి లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈఓ ధర్మారెడ్డికి భక్తులు వివరించారు. దీంతో ఆయన తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు వ్యవస్థను త్వరలో తిరుపతికి తరలింపు చేయనున్నట్లు తెలిపారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం ప్రయోగాత్మంగా బ్రేక్ దర్శన సమయం మార్పులు చేయనున్నట్లు చెప్పారు. తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు వ్యవస్థను తిరుపతిలో చేపట్టాలని నిర్ణయం తద్వారా తిరుమలలో గదులు దొరకని భక్తులు తిరుపతిలోనే వసతి పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. త్వరలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని మొదలుపెడతామని ఈఓ తెలిపారు.
శ్రీవారి దర్శనార్థం కంపార్ట్మెంట్లలో రాత్రి వేళ వేచి ఉండే సామాన్య భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు వీలుగా ఉదయం ఉన్న విఐపి బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 10 గంటలకు మార్పు చేసి ప్రయోగాత్మకంగా అమలుచేస్తామని చెప్పారు. పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈఓ ధర్మారెడ్డి ఈ విషయాలను వెల్లడించారు. అదే విధంగా త్వరలో టైమ్ స్లాట్ విధానంలోనూ టోకెన్లు ఇస్తామనీ, దీని వల్ల తిరుపతిలోనే ఉండి తమ కు కేటాయించిన సమయంలో ధర్శనానికి రావచ్చని ఈఓ ధర్మారెడ్డి తెలిపారు.