TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిధులను ఏపి ప్రభుత్వం ఇతరతర్రా కార్యక్రమాలకు మళ్లిస్తొందంటూ ఇటీవల కాలంలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై టీటీడీ స్పందించింది. స్వామి వారి ఆస్తులకు సంబంధించి వివరాలపై శ్వేతపత్రం విడుదల చేసింది. విపక్షాల ఆరోపణలు సత్యదూరమని పేర్కొంది. స్వామివారి నగదు, నగలు అధిక వడ్డీ ఇచ్చే జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేస్తున్నామనీ చెప్పిన టీటీడీ .. ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రైవేటు బ్యాంకుల్లో స్వామి నగదు, నగలు డిపాజిట్ చేయమని స్పష్టం చేసింది.
ఇప్పటి వరకూ స్వామి వారి నగదు, నగల విలువ ఇది
వివిధ జాతీయ బ్యాంకుల్లో శనివారం నాటికి స్వామి వారి నగదు డిపాజిట్లు 15,938 కోట్లకు చేరాయి. అదే సమయంలో 10,258.37 కిలోల బంగారం నిల్వలు బ్యాంకుల్లో ఉన్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి దేశ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నాయి. సామాన్యుల మొదలు కొని కోటీశ్వరుల వరకూ, సెలబ్రెటీలు, ప్రముఖులు, పారిశ్రామక వేత్తలు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు. వారి శక్తికొలది స్వామివారికి కానుకలు సమర్పిస్తూ ఉంటారు. కొందరు ఆస్తులను సైతం స్వామివారికి విరాళంగా ఇస్తూ ఉంటారు. దీంతో దేశంలోని వివిద రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో భూములు ఉన్నాయి. ఏయేటి కాయేడు స్వామి వారి ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి.