TTD: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. సర్వదర్శనం టోకెన్ ల జారీపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నది. నేటి నుండి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. బుధవారం (8వ తేదీ) ఉదయం 6 గంటల నుండి సర్వదర్శనం టోకెన్ లు జారీ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది అయితే ఈ టోకెన్ల ను కేవలం చిత్తూరు జిల్లా వాసులకే పరిమితం చేయనున్నారు. రోజుకు రెండు వేల సర్వదర్శనం టోకెన్లు మాత్రమే జారీ చేయనున్నట్లు తెలిపింది. తిరుపతి శ్రీనివాసం కాంప్లెక్స్ లోని కౌంటర్లలో టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపింది.
కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుండి తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల ను టీటీడీ నిలిపివేసింది. కేవలం ప్రత్యేక దర్శనం (రూ.300) ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న భక్తులు, సిఫార్సు లేఖల ద్వారా వచ్చే భక్తులను పరిమిత సంఖ్యలో ఇప్పటి వరకు స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. రోజు స్వామి వారిని సుమారు 20 నుండి 25వేల మంది దర్శించుకుంటున్న నేపథ్యంలో ..కేవలం పది శాతం మందకి మాత్రమే అదనంగా సర్వదర్శనం టోకెన్లు అందించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ టోకెన్లకు రాష్ట్రం నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా భారీ డిమాండ్ ఉంది. భక్తులు అత్యధిక సంఖ్యలో వస్తే కరోనా వ్యాప్తి చెందుతుందన్న ఉద్దేశంతో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే టోకెన్ లు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. తరువాత ఇతర జిల్లా వాసులకు టోకెన్లు ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. గతంలో నిత్యం 8వేల సర్వదర్శనం టోకెన్లు టీటీడీ జారీ చేసేది.
Read more:
1.Ganesh Festival: విఘ్నాధిపతి వేడుకలకే విఘ్నాలు..! గవర్నర్ జీ ఏమి చేస్తారో..?
2.AP High Court: ఏపి సర్కార్ పై మరో సారి మండిపడిన హైకోర్టు..! ఎందుకంటే..?
3.Jagananna Vidya Deevena: ఆ అంశాలపై ప్రభుత్వం వెనక్కు తగ్గేది లే..!!