నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుంతలో పడిన ఇద్దరు పిల్లలను రక్షించబోయి తల్లులు షాహినా, షబీనా మృతి చెందడం స్థానికులను కలచివేసింది. విషయంలోకి వెళితే.. పెన్నానది రివిట్ మెంట్ వాల్ నిర్మాణం కోసం ఇటీవల గుంతలు తవ్వారు. బుధవారం సాయంత్రం అటుగా వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయారు. ఆ ఇద్దరు చిన్నారులను కాపాడేందుకు వారి తల్లులు షాహినా, షబీనా గుంతలోకి దూకారు. చిన్నారులను కాపాడిన తర్వాత వారిద్దరూ గుంతలో నుండి పైకి రాలేకపోయారు. బురదలో చిక్కుకుపోయి ప్రాణాలు వదిలారు.
ఈ ఘటనతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా రివిట్ మెంట్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయనీ, జేసీబీతో గుంతలు తవ్వి వదిలివేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భారీ గుంతల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని అంటున్నారు. నిర్మాణంలో జాప్యం కూడా ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు ఆందోళనకు దిగారు.
నెల్లూరు లో భర్త, చెన్నై ఆసుపత్రిలో భార్య .. ఒకే రోజు ఇద్దరూ మృతి