ఉగాది పండుగ అంటే ప్రతి ఒక్కరూ ఎదురు చూసేది తమ జాతకాలు ఎలా ఉంటాయి.. దేశంలో, రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవాలని అనుకుంటారు. అయితే విశాఖ శారదా పీఠంలో జరిగిన పంచాంగ శ్రవణంలో తెలుగు రాష్ట్రాల సీఎంల జాతకాలను చెప్పారు స్వరూపాదనందేంద్ర సరస్వతి. తొలుత ఉగాది సందర్భంగా శారదా పీఠం గంటల పంచాంగాన్ని ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. కాల సర్ప దోషం కారణంగా మూడేళ్లుగా దేశం ఇబ్బందులు పడిందన్నారు. ఈ ఏడాది చతుర్ గ్రహ కూటమితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతోందని దీని వల్ల దేశానికి ఇబ్బందులు తప్పవని అన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాతకాలు బాగుండటంతో కొంత వరకు ఇబ్బందులు తొలగుతాయని పేర్కొన్నారు. ఉత్తరాదిన హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటాయనీ, దేశ వ్యాప్తంగా వాహన ప్రమాదాలు అధికం అవుతాయని వివరించారు. ఎండలు, వడదెబ్బలు ఎక్కువగా ఉంటాయన్నారు. జూలై నుండి సెప్టెంబర్ వరకూ ఇబ్బందికరమైన పరిస్థితులు కొనసాగుతాయన్నారు.
ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాల సీఎంల రాజకీయ భవిష్యత్తుపైనా క్లారిటీ ఇచ్చారు స్వరూపానందేంద్ర సరస్వతి. ఈ ఏడాది అంతా సీఎం జగన్ అద్భుతమైన కాలం నడుస్తొందన్నారు. అన్ని రంగాల్లో ఆయన విజయం సాధిస్తారని చెప్పారు. అలాగే తెలంగాణ సీఎం కేసిఆర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతకం కూడా బాగుందని తెలిపారు. సో..ఈ ఏడాది తెలంగాణలో ఎన్నికలు జరగనుండటంతో కేసిఆర్ మళ్లీ సీఎం అయ్యే అవకాశం ఉందని పరోక్షంగా వెల్లడించారు. తొలుత శారదా పీఠం ఆస్థాన సిద్ధాంతి తెన్నేటి శ్రీనివాస శర్మ పంచాంగ శ్రవణం చేశారు. రాజశ్యామల అమ్మవారికి నివేదించిన ఉగాది పచ్చడిని భక్తులకు పంపిణీ చేశారు.
జగన్ నివాసంలో సంప్రదాయ బద్దంగా ఉగాది వేడుకలు