Ukraine Crisis: ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలుగు విద్యార్ధుల తరలింపునకు ఏపి ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ చర్యల్లో భాగంగా బుధవారం ఏపి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలు పోలండ్, హంగేరీలకు ఏపి ప్రభుత్వ ప్రతినిధులను పంపించాలని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. మరో పక్క విద్యార్ధుల వివరాలను విదేశాంగ శాఖకు ఏపి ప్రభుత్వం అందించింది. గత ఏడు రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా సైనిక దాడి కొనసాగుతూనే ఉంది. రష్యా సైనిక చర్యలను ఉక్రెయిన్ ప్రతిఘటిస్తోంది. రష్యా – ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న పోరులో ఉక్రెయిన్ లో తీవ్ర భయానక పరిస్థితి నెలకొంది. నివాసాలపై రష్యా క్షిపణులతో దాడి జరుగుతుండటంతో పెద్ద ఎత్తున ఆస్తినష్టం, ప్రాణనష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఉన్న భారత విద్యార్ధులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగ పేరుతో ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి విద్యార్ధుల తరలింపు కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది.
Ukraine Crisis: కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి సంజయ్ వర్మను కలిసిన ఎంపి కనకమేడల
ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రభుత్వం గగనతలాన్ని మూసివేయడంతో సరిహద్దు దేశాల నుండి విద్యార్ధుల తరలింపు కార్యక్రమం చేపట్టారు. అయితే ఒక్కో విమానంలో 20 నుండి 250 మంది విద్యార్ధనీ విద్యార్ధుల తరలింపు జరుగుతోంది. ఏపికి చెందిన విద్యార్ధులు వందలాది మంది ఉండగా ఇప్పటి వరకూ పదుల సంఖ్యలోనే చేరుకున్నారు. ఈ తరుణంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి సంజయ్ వర్మను కలిసి ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్ధులను వేగవంతంగా తరలించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ ఎన్ఆర్ఐ సెల్, హెల్ప్ లైన్ నెంబర్ల ద్వారా సేకరించిన తెలుగు సహా ఇతర విద్యార్ధుల వివరాలను విదేశాంగ శాఖకు అందజేశారు.
ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు ఏపి ప్రతినిధులు
ఈ సందర్భంలో కనకమేడల మాట్లాడుత విద్యార్ధుల తరలింపునకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటున్నా, ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్ధుల వివరాలు తెలుసుకోవడంలో, కేంద్రంతో సమన్యం చేసుకోవడంలో ఏపి ప్రభుత్వం వైఫల్యం చెందిందని కనకమేడల విమర్శించారు. ఢిల్లీలో నామమాత్రంగా ఏర్పాట్లు చేసి విద్యార్ధులను తరలిస్తున్నరని విమర్శించారు. ఈ తరుణంలో ఏపి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుని పోలండ్, హంగేరీలకు ఏపి ప్రతినిధులను పంపడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?