Uunguturu (west Godavari): గ్రామాల్లో పంచాయతీ నిధులతో వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే భాగంగా పంచాయతీ పరిధిలోని కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామ పంచాయతీ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు పనులకు గురువారం భూమి పూజ నిర్వహించారు.
గ్రామ సచివాలయం – 2 ప్రాంతంలోని వైఎస్ఆర్ కాలనీ బీ బ్లాక్ లో పంచాయతీ నిధులతో డ్రైనేజీ పనులకు గురువారం సర్పంచ్ అలకనంద శ్రీనివాస్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ .. గ్రామ పంచాయతీ పరిధిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామనీ, ప్రాధాన్యత క్రమంలో పనులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
YS Viveka Murder Case: వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు ..సునీతకు మద్దుతుగా