ఏపి సీఎం వైఎస్ జగన్ తో అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ సమావేశమైయ్యారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి బుధవారం విచ్చేసిన ఆమె సీఎం జగన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంలో వారి మధ్య పలు అంశాలపై చర్చ జరిగింది. కోవిడ్ ను సమర్దవంతంగా ఎదుర్కొన్నారంటూ ఈ సందర్భంగా సీఎం జగన్ ను జెన్నిఫర్ అభినందించారు. అంతే కాకుండా జీడీపీ వృద్ధిలో నెంబర్ వన్ గా ఏపిని నిలిపారని కూడా కితాబు ఇచ్చారు. ఈ విషయాన్ని ఏపి సీఎంఓ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
రాష్ట్రంలో పెట్టుబడులకు సహకారం అందించాలని జెన్నిఫర్ ను ఈ సందర్భంగా సీఎం జగన్ కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం వివరించారు. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న అమెరికా రాయబార కార్యాలయం చీఫ్ గా జన్నిఫర్ లార్సన్ ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణతో పాటు ఏపి, ఒడిశాలకు సంబంధించి అమెరికా వ్యవహారాలను జెన్నిఫర్ పర్యవేక్షిస్తుంటారు. ఈ క్రమంలో భాగంగా జెన్నిపర్ పరిచయం కోసం మర్యాదపూర్వకంగా నేడు సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాయబార కార్యాలయ అధికారులను జెన్నీఫర్ సీఎం జగన్ కు పరిచయం చేశారు. కాగా జన్నీఫర్ కు సీఎం జగన్ దుశ్సాలువాతో సత్కరించి బొకే అందజేసి సత్కరించారు. జ్ఞాపికను అందజేసారు.
ఆర్బీకేల పని తీరుపై ఇథియోపియా బృందం ప్రశంసలు
మరో పక్క రాష్ట్రంలో ఇథియోపియా బృందం పర్యటనకు విచ్చేసింది. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ తో ఆ దేశ వ్యవసాయ మంత్రి డా.ఎం మీకొనెన్ వైమర్ నేతృత్వంలోని బృందం భేటీ అయ్యింది. రాష్ట్రంలోని ఆర్బీకేల పని తీరుపై ఆయన ప్రశంసలు కురిపించారు. సీఎం విజన్ అబ్బురపరిచిందని సభ్యులు పేర్కొన్నారు. ఆర్బీకేల్లో వాడుతున్న డిజిటల్ సొల్యూషన్స్పై సహకారం అందించాలని ఈ బృందం కోరగా తప్పకుండా సహకరిస్తామన్న సీఎం జగన్ పేర్కొన్నారు.