Vallabhaneni Vamsi : గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇటీవల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టిడిపి నేత మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా పై సీరియస్ కామెంట్లు చేశారు. అప్పట్లో ఇద్దరం తెలుగుదేశం పార్టీలో కలిసి పని చేయడం జరిగింది..ఆ టైంలో శాసనసభలో దేవినేని ఉమా పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామంటూ పెద్ద పెద్ద డైలాగులు వేశారు. దీంతో ఆయన మాటలు విని ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ టిడిపి ప్రభుత్వంలో అవుతుందని భావించాను. కానీ తర్వాత పరిస్థితి చూస్తే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు. కారణం చూస్తే పోలవరం ప్రాజెక్టులో మేజర్ ఇబ్బంది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ. అది కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన బాధ్యత.
కానీ ఆ టైములో చంద్రబాబు నల్ల చొక్కాలు…నల్లబ్యాడ్జీలు ధరించి కేంద్రంతో ఢీకొన్న పరిస్థితులు చూశాం. ఏదో ఆయన ప్రధానమంత్రి అవ్వాలని, ఆయన కొడుకుని ఇక్కడ ముఖ్యమంత్రి చేయాలని తెగ ఎగిరారు ఎన్నికలలో…అంటూ వల్లభనేని వంశీ సీరియస్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం వచ్చే వేసవి కాలం నాటికి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. వీళ్ళకి ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది.
ఇంతలోనే దేవినేని ఉమా వైసీపీ ప్రభుత్వం పై నోరు పారేసుకోవటం కరెక్ట్ పద్ధతి కాదని వల్లభనేని వంశీ ఆయన పై సెటైర్లు వేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రి అయి చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రోడ్డు మీద పడి పచ్చి బూతులు తిట్టారు. అదే టైమ్ లో వచ్చీరాని భాషతో నారా లోకేష్ కూడా బూతులు మాట్లాడుతున్నారు. ఈ తరుణంలో తాను తక్కువ అయిపోతానేమో అన్న భయంతో దేవినేని ఉమా కూడా ఈ బూతుల పోటీలో పాల్గొన్నారు అంటూ దేవినేని పై వల్లభనేని వంశీ విమర్శల వర్షం కురిపించారు.