విజయనగరం జిల్లా రామతీర్థం రామాలయాన్ని దక్షిణ అయోధ్యగా పిలుచుకుంటారు… ఈ ఆలయ ప్రాశస్త్యం కూడా ఎంతో పెద్దది.. ఏటా శ్రీరామనవమి వేడుకలు ఎంతో ఘనంగా జరపడంతో పాటు… వేట ఆలయ వార్షికోత్సవాలను శ్రీ రామ తీర్థం పేరిట వేడుకగా జాతరగా నిర్వహిస్తారు. విజయనగరం జిల్లా శ్రీకాకుళం సరిహద్దులో ఉన్న ఈ రామతీర్థం ఆలయం ఇటు రెండు జిల్లాలకు ఎంతో ప్రసిద్ధి…. అలాంటి కీలకమైన ఆలయంలోని శ్రీరాముడి విగ్రహాన్ని తల నరికి కొంతమంది దుండగులు పడేయడం… చాలా పెద్ద విషయం. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయ రథం తగలబడి పోయినప్పుడు ఎంతో హడావుడి చేసిన బిజెపి శ్రీ రామ తీర్థం విషయంలో మాత్రం వినకొండ ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది… ఇదే పరిస్థితి తెలంగాణలో జరిగితే అక్కడ ఉండే నేతలు ముఖ్యంగా బిజెపి నేతలు… బండి సంజయ్ రాజా సింగ్ లాంటి నేతలు స్పందన వేరుగా ఉండేది.. వారు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి వెంటనే దాన్ని తమ పార్టీకి అనుబంధంగా, తమ పార్టీకి సిమెంటు వచ్చేలా నిరసనలు చేపట్టేవారు.. మరి ఆంధ్ర బీజేపీ నేతలు మాత్రం దీనికి భిన్నం… అసలు దేనికి స్పందించాలో దేనికి సైలెంట్ ఉండాలో తెలియని అయోమయ పరిస్థితి వారిది.. హిందుత్వమే ప్రధాన అజెండాగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పక్షం పాత్ర వహించాలని కోరుతున్న బిజెపి ఇలాంటి కీలకమైన సమయాలను అందిపుచ్చుకుని హిందూత్వ ప్రధాన ఎజెండాగా రాష్ట్రంలో ముందుకు సాగడానికి నేతల తీరే కారణం..
సోము ఏమిటిది??
ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించిన దగ్గర్నుంచి ఏపీ బీజేపీ లో కొన్ని కీలక మార్పులు వచ్చాయి… గతంలో పోలిస్తే కాస్త స్పీడ్ పెరిగినట్లు కనిపిస్తున్న ఈ స్పీడు పార్టీ పుంజుకోవడానికి ఏమాత్రం సరిపోదు. ముఖ్యంగా హిందుత్వ ఎజెండాతో ముందుకు సాగే బిజెపి ఆలయాల ముఖ్యంగా ప్రధాన ఆలయాల విషయంలో జరుగుతున్న దాడుల విషయంలో స్పందిస్తుంది శున్యం. కేవలం సోము వీర్రాజు తప్ప మిగిలిన ఫైర్ బ్రాండ్ నాయకులెవరూ కనిపించకపోవడం హిందూత్వ ఎజెండా ధాటిగా ఎదుటి పక్షం పై దాడులు చేసే నేతలు ఆంధ్ర బిజెపికి లేకపోవడం పెద్ద మైనస్… ఇటీవల బీజేపీ లోకి వచ్చిన ఆంధ్ర నేతలంతా కేవలం తమ ప్రాపకం కోసం తమ వ్యాపారాలు కోసం వచ్చిన వారే తప్ప పార్టీకి పెద్దగా ఉపయోగం ఉన్న వారు లేరు. దీంతో ప్రతి విషయాన్ని సోము వీర్రాజు సింగిల్ మెన్ ఆర్మీ గా డీల్ చేస్తున్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ బిజెపి ఇతర నేతల నుంచి మద్దతు పూర్తిగా సున్నా.
** బుధవారం సైతం సోము వీర్రాజు ప్రెస్ మీట్ పెట్టి వివిధ అంశాలపైన స్పందించిన.. మధ్యలో ఆలయాల దాడులు రామతీర్థం ఆలయం పై స్పందించిన అది పెద్దగా మీడియాలో రాలేదు. అయితే ఆయన కేవలం స్పందించడం మాత్రమే కాకుండా ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లి… ఆలయం దగ్గరే మీడియాతో మాట్లాడి విషయాన్ని పెద్దది చేసి ఉంటే బిజెపికి ఇది ప్లస్ అయ్యేది.. బిజెపి లోని ఇతర నేతలు సైతం దీన్ని పెద్ద సీరియస్ అంశంగా పరిగణించిన ట్లు లేరు…