Mansas Trust: మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ బాధ్యతలు నిర్వహిస్తున్న టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును జైలుకు పంపి తీరతామని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇంతకు ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతో అశోక్ గజపతిరాజు తిరిగి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మాన్సాస్, సింహాచలం ఆలయ భూముల్లో జరిగిన భూ అక్రమాలను వెలికి తీసి ఆయనను అరెస్టు చేయడం ఖాయమంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
Read More: Pegasus: పెగసెస్ పై కేంద్రం కీలక ప్రకటన..!!
ఈ క్రమంలో ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ సింహచలం దేవస్థానంలో ప్రాపర్టీ రిజిస్టార్ లో భారీగా భూములు తొలగించినట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం భూముల వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఏపి ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు నోడల్ అఫీసర్ గా దేవాదాయ శాఖ కమిషనర్ ను నియమించింది. మాజీ ఇఓ రామచంద్రన్ హయాంలో అక్రమాలపై విచారణకు ఆదేశించారు. మూడు నెలల్లో నివేదక సమర్పించాలని ఏపి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మాన్సాస్ ట్రస్ట్ భూముల విక్రయాల్లో అక్రమాలు, తదితర ద్వారా రూ.74.72 కోట్ల మేర నష్టం కల్గించారని పేర్కొంటూ గతంలో దేవస్థానం ఇఓగా పని చేసిన రామచంద్రమోహన్ పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు విధించిన విషయం తెలిసిందే. అధికారుల కమటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్న ప్రభుత్వం దీనిపై మరింత లోతుగా దర్యాప్తునకు విజిలెన్స్ విచారణ చేపడుతున్నట్లు తాజాగా వెల్లడించింది.
మరో పక్క మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా తనను నియమించేలా అదేశాలు ఇవ్వాలంటూ ఊర్మిల గజపతిరాజు ఏపి హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా ఊర్మిల తరపున న్యాయవాది మాట్లాడుతూ ఆనంద గజపతిరాజు మొదటి భార్య కుమార్తె సంచయిత, రెండో భార్య కుమార్తె ఊర్మిలను ప్రభుత్వం వారసులుగా గుర్తించిందని కోర్టుకు తెలిపారు. కావున అశోక్ గజపతిరాజును చైర్మన్ గా తొలగించి ఆ స్థానంలో ఊర్మిళ గజపతిరాజును చైర్మన్ గా నియమించాలని న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను మంగళవారంకు వాయిదా వేసింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?