Vigilance Officer Ride: రాష్ట్రంలోని పలు ఆలయాల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఈ విషయాలు ఆడిట్, విజిలెన్స్ తనిఖీల్లోనూ వెలుగు చూస్తున్నాయి. ఇంతకు ముందు విజయవాడ కనకదుర్గ ఆలయంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు దృవీకరించిన నేపథ్యంలో దాదాపు 15 మందిపై వేటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుడి ఆలయంలో జరిగిన అవినీతి అక్రమాలపై విజిలెన్స అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆలయ పాలకమండలి సభ్యుడి ఫిర్యాదుతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఫిర్యాదులోని 27 అంశాలపై సంబంధిత సెక్షన్ ఫైళ్లను విజిలెన్స్ అధికారులు తనిఖీ చేస్తున్నారు. విజిలెన్స్ అధికారుల తనిఖీతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
Vigilance Officer Ride: రూ.70 కోట్ల ఖర్చలపై అభ్యంతరాలు
కాగా ఏపిలోని పలు ప్రధాన ఆలయాల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినట్లు అడిట్ అభ్యంతరాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాల్లో రూ.951 కోట్ల ఖర్చుపై ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో రూ.70 కోట్ల ఖర్చలపై అభ్యంతరాలు ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడ దుర్గగుడిలో రూ.110 కోట్లు, శ్రీకాళహస్తి లో రూ.150 కోట్లు, కాణిపాకం విఘ్నేశ్వరస్వామి ఆలయంలో రూ.122 కోట్లు ఖర్చుపై ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా చర్యలకు దిగినట్లు సమాచారం.