NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Vijaya Sai Reddy: వదంతులకు చెక్…! విశాఖలో విజయసాయి యాక్టివ్ రోల్..! అందుకేనా..?

Vijaya Sai Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress) పార్టీలో నెంబర్ 2 గా కీలక పొజిషన్ లో ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (Vijaya Sai Reddy) ఓ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఇటీవల కాలంలో ఆయనపై వస్తున్న వదంతులకు చెక్ పెట్టినట్లు అయ్యింది. విజయసాయ రెడ్డి ఇటీవల కొద్ది రోజుల పాటు ఢిల్లీ (Delhi)లో మకాం వేయడంతో ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతల నుండి సీఎం జగన్ తప్పిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. పార్టీలో ఆయన ప్రాధాన్యత తగ్గిందనీ ప్రచారం జరిగింది. ప్రభుత్వ సలహాదారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ కీ రోల్ పోషిస్తున్న నేపథ్యంలో విజయసాయి రెడ్డి ప్రాధాన్యత తగ్గించారా అనే అనుమానాలు షికారు చేశాయి. ఈ తరుణంలో విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇచ్ చార్జి తానే అనే విధంగా ఒ కీలక నిర్ణయాన్ని తీసుకుని అమలు చేస్తున్నారు.

Vijaya Sai Reddy conducting praja darbar in visakha
Vijaya Sai Reddy conducting praja darbar in visakha

Vijaya Sai Reddy: వారంలో అయిదు రోజులు ప్రజాదర్బార్..

ప్రజల నుండి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు విజయసాయి రెడ్డి ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారంలో అయిదు రోజుల పాటు ఈ ప్రజా దర్బాద్ కొనసాగుతుంది. సోమవారం నుండి శుక్రవారం వరకూ ప్రజా దర్బార్ లో విజయసాయి రెడ్డి ప్రజలను నేరుగా కలుసుకుంటున్నారు. మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకూ ప్రజలు ఆయనను నేరుగా కలిసి సమస్యలు విన్నవించేలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విశాఖ పట్టణానికి చెందిన వారే కాకుండా ఉత్తరాంధ్ర కు చెందిన వారంతా కలిసి తమ సమస్యలను ఆయనకు చెప్పుకోవచ్చు. ప్రజల నుండి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు విజయసాయి కృషి చేస్తున్నారు. విజయసాయి రెడ్డి నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కు ప్రజల నుండి విశేష స్పందన కనబడుతోంది.

విశాఖలోనే నివాసం

నెల్లూరు జిల్లాకు చెందిన విజయసాయి రెడ్డి విశాఖలో శాశ్వత నివాసితులుగా ఉండాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన ఇటీవల స్పష్టం చేశారు. ఆయన రాజ్యసభ పదవీ కాలం వచ్చే ఏడాది పూర్తి అవుతుంది. అయితే 2024 ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసే అలోచన ఉందని భావిస్తున్నారు. అందుకే ఆయన పూర్తి స్థాయిలో విశాఖ పై కాన్సట్రేషన్ చేస్తున్నారని సమాచారం. దాదాపు ఆరు సంవత్సరాల నుండి విశాఖలోనే విజయసాయి రెడ్డి ఉంటున్నారు. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా విశాఖలో పార్టీ బలోపేతానికి విజయసాయి రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

వదంతులకు చెక్.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొత్తం అయుదుగురు మంత్రులు ఉన్నారు. బొత్స సత్యనారాయణ, ఝక్మాన కృష్ణదాస్, అవంతి శ్రీనివాస్, పుష్ప శ్రీవాణి, అప్పలరాజు లు ఉన్నారు. ప్రస్తుతం వీరు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అయితే మంత్రుల వద్దకు వెళ్లి సమస్యలు విన్నవించుకోలేని వారు ప్రజాదర్బార్ లో విజయసాయిని కలిసి సమస్యలపై విజ్ఞాపనలు ఇస్తున్నారు. తాజాగా విజయసాయి ప్రజా దర్బార్ నిర్వహిస్తుండటంతో ఇప్పటి వరకూ ఆయనపై వస్తున్న వదంతులకు చెక్ పెట్టినట్లు అయ్యింది. రాబోయే ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ కు పోటీ చేయాలని విజయసాయి ఆలోచన చేస్తున్నారా అనేది త్వరలో తేలనుంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju