Vijaya Sai Reddy: విశాఖలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు జరుగుతున్నాయంటూ ఇటీవల ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములు విజయసాయి రెడ్డి పేరుతో కబ్జాలు చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై విజయసాయి రెడ్డి నేడు స్పందించారు. విశాఖలో గురువారం జరిగిన వైఎస్ఆర్ వర్థంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు తనపై భూ ఆరోపణలు చేస్తున్నారనీ, భూములు ఆక్రమించాలని గానీ కొనుగోలు చేయాలని కానీ తనకు లేదని స్పష్టం చేశారు. తనకు డబ్బుపై ఆసక్తిలేదు. హైదరాబాద్ లో తాను ఉంటున్నది అద్దె ఇల్లేనని పేర్కొన్నారు. విశాఖలో స్థిరపడాలనే కొరిక ఉందని చెప్పారు. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు. తన పేరు చెప్పిఅక్రమాలకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి. భూ అక్రమాలకు ఎవరు పాల్పడినా వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Vijaya Sai Reddy: కార్పోరేటర్లకు కర్తవ్యభోధ
పనిలో పనిగా జీవీఎంసీ మేయర్, కార్పోరేటర్ లకు విజయసాయి రెడ్డి కర్తవ్యభోధ చేశారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఆ తరువాత అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. కార్పోరేటర్ లు రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యలపై స్పందిస్తూ అభివృద్ధిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ట్విట్టర్ వేదికగా నిత్యం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఇతర టీడీపీ నాయకులను విమర్శించే విజయసాయి రెడ్డి ఒక్క సారిగా ఎన్నికల వరకే రాజకీయాలు అంటూ కీలక వ్యాఖ్యలు చేయడంతో పలువురు ఆశ్చర్యానికి గురైయ్యారు.
1.AP Government: విద్యార్థులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..అది ఏమిటంటే..
2.Tammineni Vs Darmana: మారుతున్న సీక్కోలు రాజకీయం .. ! తమ్మినేని, ధర్మాన లో మంత్రి పదవి ఎవరికి.?.
3.YS Jagan Sharmila: తండ్రి సమాధి వద్ద కలిసిన జగన్ – షర్మిల – విజయమ్మ : ఒకేసారి ప్రార్ధనలు