Vijaya Sai Reddy: ఏపిలో ఎప్పట్లో ఎన్నికలు లేనప్పటికీ రాజకీయ వాతావరణం హీట్ ఎక్కింది. రాష్ట్రంలో అధికార వైసీపీని ఢీకొట్టేందుకు ప్రతిపక్షాలు జతకట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నోటి వెంట పొత్తుల మాటలు బయటకు వచ్చాయి. పొత్తుల అంశం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ పార్టీల పొత్తుల వ్యవహారంపై వైసీపీ విమర్శల దాడి మొదలు పెట్టింది. ఈ క్రమంలో వైసీపీ అనుబంధ విభాగాల ఇన్ చార్జి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరో సారి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Read More: YSRCP: వైసీపీలోకి మైహోం రామేశ్వరరావు..! ఆ పదవి కోసమే(నా)..?
Vijaya Sai Reddy: బాబు వెన్నులో జలదరింపు
బాబు వెన్నులో జలదరింపు స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు విజయసాయిరెడ్డి. ఎన్నికలు ఇంకా రెండేళ్లు ఉన్నా పొత్తుల కోసం అప్పుడే ఆరాటాలు మొదలయ్యాయని అన్నారు. గుంపు కట్టకపోతే 151 సీట్లు గెలిచిన పర్వతాన్ని ఢీకొట్టలేమని బాబు గ్యాంగ్ కు అర్ధమైందని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. అందుకే వెంట్రుకతో కొండను లాగే ప్రయత్నాలను చంద్రబాబు మొదలు పెట్టారని విజయసాయి రెడ్డి విమర్శించారు.