Vijaya sai: కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్ చైర్మన్ అశోక్ గజపతిరాజుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ రోజు అశోక్ గజపతిరాజుపై ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ బైలా, ఫ్యామిలీ లా అయినా చట్టానికి లోబడి ఉండాలని భారత రాజ్యాంగం నిర్ధేశించిందనీ, రెండింటి మధ్య వివాదం వస్తే చట్టం, రాజ్యాంగమే చెల్లుబాటు అవుతుందన్నారు. సతీ సహగమనం, వరకట్నం, బహుభార్యత్వం కుటుంబ ఆచారమంటే చట్టం ఒప్పుకుంటుందా? స్త్రీలకు ఆస్తిహక్కివ్వడం మా సంస్కృతిలోను, పూసపాటి రాజ్యాంగంలోనూ లేదంటే చెల్లుతుందా అశోక్ అంటూ విజయసాయి ప్రశ్నించారు.
ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే అశోక్ గజపతి కత్తి అందించి ఖతం చేశాడని వ్యాఖ్యానించారు. అందుకే ఎన్టీఆర్ పార్టీ నుండి గెంటేసిన వారిలో మొదటి పేరు చంద్రబాబుదైతే, రెండోది అశోక్దేనని విజయసాయి అన్నారు. ఎన్టీఆర్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ అప్పటి స్పీకర్ కు లేఖ రాసి ఆయనపై చెప్పులు కూడా విసిరారనీ, అశోక్ గజపతిది అన్నం పెట్టిన వ్యక్తికే సున్నం రాసిన రక్త చరిత్ర అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
Read More: AP CS: ఏపి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఎక్స్టెన్షన్ రాకుంటే ఈ అధికారే నూతన సీఎస్.!?
అశోక్ గజపతిరాజుపై విజయసాయి చేస్తున్న విమర్శల ట్వీట్లకు నెటిజన్ ల నుండి వ్యతిరేక కామెంట్స్ వస్తున్న సంగతి తెలిసిందే. మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంలు ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి విజ్ఞప్తులు చేసినా విజయసాయి తన విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు. దీంతో సీఎం వైఎస్ జగన్.. ముద్రగడ పద్మనాభం లేఖను కూడా లైట్ గా తీసుకున్నారన్న మాట వినబడుతోంది.
ఏ బై లా, ఫ్యామిలీ లా అయినా చట్టానికి లోబడి ఉండాలని భారత రాజ్యాంగం నిర్దేశించింది. రెండింటి మధ్య వివాదం వస్తే చట్టం, రాజ్యాంగమే చెల్లుబాటవుతుంది.
1/4
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 26, 2021