Vijayasai reddy : ఏపీ ముఖ్యమంత్రి , వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మినబంటు అనే పేరున్న రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ . ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ కాపిటల్ విశాఖపట్టణంలో ఆయన చేస్తున్న ఆపరేషన్ చర్చకు దారి తీస్తోంది. తాజాగా విజయసాయిరెడ్డి సమక్షంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాథ్ వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, దీనిపై గంటా స్పందించారు.
విజయసాయిరెడ్డి Vijayasai reddy మైండ్ గేమ్ చూశారా?…
గంటా శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి పలు ప్రతిపాదనలు పంపారని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ స్పందించారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు మైండ్ గేమ్ లో భాగం అని కొట్టిపారేశారు. తాను ఎలాంటి ప్రతిపాదనలు,వివరాలు పంపించానో విజయసాయిరెడ్డి చెప్పాలని గంటా శ్రీనివాసరావు అన్నారు. మున్సిపల్ ఎన్నికలకు ఐదు రోజుల ముందు ఇలాంటి స్టేట్ మెంట్ ఎందుకు ఇచ్చారో ఆయనే చెప్పాలని అయన అన్నారు. ఈ స్పెక్యులేషన్ వెనుక ఉద్దేశం, లక్ష్యం ఉండి ఉండవచ్చు అని పేర్కొన్నారు.
100 సార్లు ఇదే జరిగింది..
తనకు పార్టీ మారే ఆలోచన లేదని గంటా శ్రీనివాస రావు చెప్పుకొచ్చారు. 2019 నుంచి ఇప్పటి వరకు 100 సార్లు ప్రచారాలు జరిగాయని వెళ్ళాల్సి వస్తే ధైర్యంగా అందరికీ చెప్పే నిర్ణయం తీసుకుంటానని అన్నారు.2019 తర్వాత జిల్లాలో నా అనుచరులు చాలా మంది పార్టీ మారారని, అంత మాత్రాన నేను వెళ్తాననేది కరెక్ట్ కాదని అన్నారు. నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపు పైనే తన దృష్టి ఉందని అన్నారు. వైసీపీలో చేరిన కాశీ విశ్వనాథ్ ఏడాది కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిబంధనల ప్రకారం నడుపుకుంటున్న వ్యాపారాలను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని అందుకే ఆయన వైసీపీలో చేరారని అన్నారు. మొత్తంగా విజయసాయిరెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.