Vijayasai Reddy : ఏపీ ముఖ్యమంత్రి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నిహితుడనే పేరున్న ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా కీలక ప్రకటన చేశారు. ఏపీలో హాట్ టాపిక్ గా మారిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమని విజయసాయిరెడ్డి అన్నారు. ఎలాంటి పోరాటానికి అయిన తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తేల్చిచెప్పారు.
Vijayasai Reddy విజయసాయిరెడ్డి ఏమంటున్నారంటే…
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిన్న కేంద్రం మరోసారి కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటీకరణ ఆగబోదని కేంద్రం తేల్చేసింది. దీంతో ఏపీలోని అన్ని పార్టీలు దీనిపై భగ్గుమన్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై విశాఖ స్టీల్ ప్లాంట్ ను నష్టాల్లో చూపించే ప్రయత్నం కేంద్రం చేస్తోందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. 2002 నుండి 2015 వరకు విశాఖ ఉక్కు లాభాలు తెచ్చిపెట్టిందని 19,700 ఎకరాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ లక్ష కోట్లకు పైగా విలువ చేస్తుందన్నారు.
ఇదిగో ఆప్షన్….
రుణాలను బ్యాంకులో ఈక్విటిగా మార్చితే స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేసుకోవచ్చని.. దానివల్ల ప్రజలే కొనుక్కునే అవకాశం ఉంటుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.ప్రయివేట్ పరం చేయకుండా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేయాలని సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం చేయూత ఇస్తే నష్టాల బాట నుండి లాభల్లోకి తీసుకురావొచ్చని తెలిపారు. సొంత గనులు కేటాయించి రుణబారాన్ని ఇక్వీటిలుగా కన్వర్ట్ చేయాలని.. ఫిబ్రవరి 6న స్టీల్ ప్లాంట్ కోసం ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ రాశారని గుర్తు చేశారు. 2014 నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలు బాటలో నడుస్తుందని … సొంత గనులు కేటాయించడం వల్ల నష్టాల నుండి లాభాల బాట పడుతుందన్నారు. స్టీల్ ప్లాంట్ పై టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు.